తెలంగాణ సచివాలయంలో విద్యుత్ ను ఆదా చేసేందుకు ఏసీల తొలగింపు చేయాలని టి.సర్కార్ నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా ఉంటుండడంతో కోతలు అధికమౌతున్న సంగతి తెలిసిందే. దీనితో విద్యుత్ ను ఆదా చేయాలని టి.సర్కార్ భావించింది. అందులో భాగంగా మొదటగా సచివాలయంలో ఉన్న ఏసీలను తొలగించి విద్యుత్ ను ఆదా చేయాలని నిర్ణయం తీసుకుంది. అనుకున్నదే తడవుగా సోమవారం 220 ఏసీలలో 170 ఏసీలను తొలగించారు. మంత్రులు..ముఖ్యకార్యదర్శులకు మాత్రమే ఏసీలను కేటాయించారు. కిందిస్థాయి అధికారులకు ఉన్న ఏసీ కనెక్షన్ లను కట్ చేశారు.
- Blogger Comment
- Facebook Comment
Subscribe to:
Post Comments
(
Atom
)
0 comments:
Post a Comment